Sunday, May 19, 2024

కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి చెప్పాలి

spot_img

కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా, తెలంగాణ సమస్యలు డిల్లీ వేదికగా ప్రశ్నించేందుకు, పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఆయా జిల్లాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో హరీశ్ రావు తెలంగాణ భవన్ లో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..రాజీ పడకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బీఆర్ఎస్ తోనే సాధ్యం అవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ మోసాలపై నిలదీయాలి. ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలి. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ  విఫలమైంది. రెండు, మూడు హామీలు అసంపూర్తిగా అమలు చేసి అన్ని చేసినట్లు ప్రచారం చేసుకుంటోంది.రుణమాఫీ చెల్లించకుండా చోద్యం చూస్తోంది. కరెంట్ రాకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు నీరు అందక ట్యాంకర్ లతో నీళ్ళు అందించే కాలం వచ్చింది. కాలిపోయే మోటార్లు, పెలిపోయే ట్రాన్స్ఫార్మర్ ల దుస్థితిని కాంగ్రెస్ మళ్ళీ తెచ్చింది. అర్హులు అంటూ గ్యాస్ సబ్సిడీ 30% శాతం మందికే ఇస్తూ, మిగతా 70% వారికి మొండి చేయి చూపుతున్నారు.ఇలాంటి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. మార్చి 17 తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటుంది. హామీలు అమలు చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ను నిలదీయాలి.వానాకాలం వడ్లు బోనస్ ఇచ్చి కొనలేదు. వచ్చే యాసంగి పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని నిలదీయాలి.

కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే అనునిత్యం నిలదీసే బీఆర్ ఎస్ తోనే అది సాధ్యమవుతుందన్నారు హరీశ్ రావు. వాస్తవాలను ఎప్పటికపుడు అన్ని వర్గాల ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమయ్యింది. అడుగడుగునా కాంగ్రెస్ ను నిలదీసే రోజులు ముందున్నాయి. పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: నలుగురి అభ్యర్థుల పేర్లతో లోక్ సభ ఎన్నికల తొలి జాబితాను ప్రకటించిన కేసీఆర్

Latest News

More Articles