కాంగ్రెస్ వాళ్లు దద్దమ్మలు..అందుకే సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ వస్తున్నారు అనగానే కాంగ్రెస్ వాళ్ళ లాగులు తడుస్తున్నాయన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ BRS మీటింగ్ లో మాట్లాడిన ఆయన..కాంగ్రెస్ వాళ్ళకు అహంకారం పెరిగింది.రైతు బంధు నిలిపివేశారు…రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు. ప్రాజెక్టులను KRMB కి అప్పజెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు. 9 ఏండ్లు అయినా నదీ జలాలు పంపిణీ చేసే తీరిక కేంద్రానికి లేదు. అలాంటి కేంద్రం సాగర్ నుండి మనకు మంచి నీరు కావాలంటే తొందరగా ఇస్తదా అని ఆలోచన చేయాలి. ప్రాజెక్టులను krmb కి ఇవ్వడం అంటే ఆంధ్రకు నీళ్లు అప్పనంగా రాసి ఇవ్వడమేనన్నారు.
అప్పట్లో చంద్రబాబు సాగర్ డ్యామ్ పై హుషారు చేస్తే కేసీఆర్ తరిమికొట్టారని తెలిపారు జగదీష్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ వాల్ల చేతకానితనంతో సాగర్ మన చేతుల్లోంచి వెళ్ళిపోయిందన్నారు. కాంగ్రెస్ వాళ్లు చేసిన నిర్వాకం వల్ల ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. కోమటిరెడ్డి లాంటోడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు… యాదాద్రి పవర్ ప్లాంట్ అపుతా అంటున్న కోమటిరెడ్డి ని చెప్పులతో కొడతారు….కాంగ్రెస్ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే రేపటి వరకు సాగర్ ప్రాజెక్టును మన పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు శ్రీ రమరక్ష కేసీఆర్ మాత్రమే… సాగర్ నీళ్ల కోసం కేసీఆర్ పోరాటం మొదలు పెడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళను ఉరికించి కొడతాం…. మన కళ్ల ముందే సాగర్ నీళ్లు పోతుంటే రైతుల కడుపు రగులుతోందన్నారు. కాంగ్రెస్ సీఎం ,క్యాబినెట్ అంతా రండనే.. కేసీఆర్ పై ఎదురుదాడి చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి.
ఇది కూడా చదవండి:భయపడకండి..మీకు నేనున్నా..ఉద్యోగులతో పేటీఎం బాస్..!!