Saturday, May 11, 2024

ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ల మీద పరిజ్ఞానం లేదు

spot_img

రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతులు 25-30 వేలు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారన్నారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోయినా ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నికి సోయి లేదన్నారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… లక్షలాది ఎకరాలు పంట పొలాలు ఏండి పోతున్నాయి. పంట చేతికోచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిన పంటలు రోజు తిరిగి చూస్తున్నాం. అంతకు ముందు జిల్లా ఎమ్మెల్యే లు, మంత్రులుకు మొరపెట్టుకున్నారు రైతులు.. అయినా వారు పట్టించుకోవడం లేదు.కాలేశ్వరం నుంచి 100 టీఎంసిల నీరు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నా చేయలేదు. కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్నారు. కరువు కమ్మకొస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీఎం, మంత్రులు సమీక్ష చేసి ఏ పంటలు పెట్టుకోవాలి అని రైతులకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఏ సీజనల్ కాలం ఇలాంటి పరిస్థితి ఉండబోతుంది అని రైతులకు చెప్పి ఎరువులు, విత్తనాలు ముందుగా తీసుకొచ్చేవాళ్లం.కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి పంట స్టార్ట్ అయ్యింది. ఈ ప్రభుత్వాన్నికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులు సమస్యలు పైన సమీక్ష చేయాలి. గతంలో ప్రతి ఏడాది రెండు పంటలకు మేము సమీక్ష చేసే వాళ్ళం. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యేత ప్రభుత్వం పైన ఉంటుంది. వ్యవసాయం రంగం పైన బాధ్యత అసలు ఈ ప్రభుత్వానికి లేదు. కొన్ని చోట్ల నీళ్లు ఉన్న ఇస్తలేరు, విద్యుత్ సప్లై సరిగ్గా లేక మోటార్లు కాలిపోతున్నాయ్ అని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు.

కాళేశ్వరం ఏదో కుంగి పోయింది అని కేసీఆర్ ని బద్నామ్ చేయడమే తప్పా ఇంకొక్కటి లేదన్నారు జగదీష్ రెడ్డి. ఆల్మటి లో నీళ్లు ఉన్నాయ్, ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చి పోయిన కర్ణాటక నాయకులని అడిగి 10టిఎంసిల నీళ్లు తీసుకొని రండి అని అన్నారు. కేఆర్ఎంబి చాలా ఏండ్ల నుంచి ఉంది, కానీ మేము అవన్నీ చూడలేదు రైతులకు నీళ్లు ఇచ్చాము. రైతులను బ్రతికించుకోవడం కోసం కేసీఆర్ ఎన్నోనిర్ణయాలు తీసుకున్నారు. కోమటిరెడ్డి కి సాగర్ డ్యాం పైకి వెళ్లాలంటే లాగులు తడుస్తున్నాయి. మేము ఎండిన పంటలు తిరిగి చూస్తుంటే.. కోమటిరెడ్డి ఏమి తెలియనట్టు 10 రోజుల నుంచి నటిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మీద పరిజ్ఞానం లేని వ్యక్తి అని అన్నారు.

మంత్రులు అప్పుడే వసూలు.. ముడుపులు కట్టుడు మొదలుపెట్టారని విమర్శించారు జగదీష్ రెడ్డి. అందిన కాడికి రైస్ మిల్లర్లు.. కాంట్రాక్ట్ ల నుంచి దండుకుంటున్నారని తెలిపారు. కోమటిరెడ్డి నల్గొండలో ఇండ్లు కట్టుకునే పేద, మధ్యతరగతి ప్రజల నుంచి మున్సిపల్ అధికారులను పంపించి 50వేలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఫక్తు రాజకీయం తప్పా ఇంకొక్కోటి లేదన్నారు. బీజేపీకి, కాంగ్రెస్ కి బీ టీం, కాంగ్రెస్ కి బీజేపీ బి టీం గా ఉన్నారో  అర్ధం కావడం లేదన్నారు.  ఏ రోజైనా  కిషన్ రెడ్డి ప్రజలు కోసం మాట్లాడారా అని ప్రశ్నించారు. మీడియాలో స్పేస్ తప్పా, ప్రజలు బేస్ లేని వ్యక్తి కిషన్ రెడ్డి అని అన్నారు. కిషన్ రెడ్డి ని ED విచారించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో రెండేళ్లు గా ఆధారాలూనాయి అని అంటున్న కిషన్ రెడ్డి ఈడీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.దమ్ము, ధైర్యం ఉంటే.  మీ పార్టీకి బలమే ఉంటే.. BRS నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలన్నారు. లిక్కర్ కేసులో ఈడీ అధికారులు రెండేళ్లు విచారణ చేశారు. ED కేసుల పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కాలని  బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి.

తెలంగాణకు కేసీఆర్ యే  శ్రీరామరక్ష అని అన్నారు జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులైంది.. రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: రేపు వైన్ షాప్ లు బంద్

Latest News

More Articles