తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మకూడదని మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ తెలిపారు. ఇదంతా అసత్య ప్రచారం అంటూ కొట్టిపారేశారు. గురువారం ఆయన హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని తన నివాసంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: తొలిసారి హైదరాబాద్లో ఒక నిందితుడికి ఉరిశిక్ష!
2012లో పీఆర్పీ విలీనం తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తాను బీఆర్ఎస్ లో చేరానని..అప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం పనిచేస్తున్నట్లు అరూరి చెప్పారు. గత కొన్నాళ్లుగా అరూరి రమేశ్ బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు.