Thursday, May 2, 2024

వైసీపీ నాలుగో జాబితా విడుదల…9 మంది అభ్యర్థులు వీరే..!!

spot_img

పక్క రాష్ట్రంలో ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా…వైఎస్సార్ సీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇంచార్జీలను మార్చిన వైసీపీ..తాజాగా 8 అసెంబ్లీ ఒక లోకసభ స్థానానికి ఇంచార్జీలను మార్చింది. తాజాగా నాలుగో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నియమించారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ కారణంతో మూడు రోజుల పాటు అభ్యర్థుల మార్పులు, చేర్పులకు కాస్త బ్రేక్ పడింది. దీంతో నాలుగు జాబితా విడుదల కొంచెం లేట్ అయ్యింది.

9 మంది అభ్యర్థులు:

-చిత్తూరు లోక్ సభ – నారాయణస్వామి
-జీడీ నెల్లూరు – రెడ్డప్పా
-కొవ్వూరు – తలారి వెంకట్రావ్
-కనిగిరి – దద్దాళ నారాయణ యాదవ్
-గోపాలపురం – తానేటి వనిత
-శింగనమల- ఎం వీరాంజనేయులు
-తిరువూరు- స్వామిదాస్
-మడకశిర -ఈర లక్కప్ప
-నందికొట్కూరు – డా. సుధీర్ దారా

ఇది కూడా చదవండి: ఎంపీ ఎన్నికల్లో విజయం మనదే

Latest News

More Articles