Friday, May 17, 2024

ఎంపీ ఎన్నికల్లో విజయం మనదే

spot_img

గజ్వేల్: కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని.. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడు వంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని వార్తలు వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం గజ్వేల్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తరు?

రాబోయే ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేద్దాం. ఏడు ఎమ్మెల్యేలలో ఆరు ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు ఉన్నారు. అద్భుత విజయం సాధిస్తాం. నీళ్లు పల్లమెరుగు అంటే నీళ్లను మీదికి ఎక్కించి చూపించింది మన కేసీఆర్. ఎండాకాలంలో మత్తల్లు దూకేలా చేసింది కేసీఆర్. మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లో నిండా నీళ్లు నింపి పెట్టింది కేసీఆర్. ఆ నీళ్లను కూడా ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయాలని గజ్వేల్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Latest News

More Articles