Friday, May 17, 2024

ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్ డబ్బు సంచులు మోస్తున్నడు

spot_img

ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి డబ్బు సంచులు మోస్తున్నాడని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించు కోవడం లేదు. యూట్యూబ్ ఛానెల్ లు, మేధావులకు ఈ విద్యార్థినీల ఆత్మహత్య లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మేధావులు స్పందించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఢిల్లీకి చెక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ మాత్రమే అమలు చేశారు అది మహిళకు ఉచిత బస్ ప్రయాణం.చాలా గ్రామాలకు బస్ సౌకర్యాలు లేవన్నారు బాల్క సుమన్.

ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పోతున్నాడు.. డబ్బు సంచులు మోసుకుపోతున్నాడు అని అన్నారు బాల్క సుమన్. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తున్నాడు. స్టాఫ్ నర్స్ పోస్టులు మేమె ఇచ్చాము, గురుకుల పోస్టులు మేమె ఇచ్చాము. ఇవన్నీ ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదు. ఒక్క బస్ ఫ్రీ మాత్రమే పెట్టారు అది కూడా అనేక గ్రామాలకు బస్ సౌకర్యాలు లేవు. ఎన్నికల షెడ్యూల్ ఎంత తొందర వస్తే అంత మేలు అన్నట్లు చూస్తున్నాడు ఈ సీఎం.

రోజు వచ్చేటప్పుడు పెద్దమ్మ తల్లికి ఎన్నికల షెడ్యూల్  తొందరగా రావాలని మొక్కుతున్నాడంట. ఎందుకంటే షెడ్యూల్ వస్తే హామీలు ఎగగొట్టవచ్చని చూస్తున్నారని ఆరోపించారు. ఒక్క మేడి గడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సీఎం. ఒక్క3 ఫిల్లర్లు కుంగాయి. అయితే వాటిని పునరుద్ధరణ పనులు చేయకుండా….నాటి మా ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేడి గడ్డ డ్యామ్ పై మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే వాళ్ళు కుంగిన ఫిల్లర్ల దగ్గరకు మళ్ళీ నీళ్లు వదులుతున్నారు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తున్నారు.. పోతున్నారు. ఆయితే మళ్ళీ కుంగిన ఫిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగాలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు మాకు అనుమానం వస్తోందన్నారు బాల్క సుమన్.

రాజకీయ పరంగా కోపం ఉంటే మాపై రాజకీయంగా తీర్చుకోండి కానీ రైతుల పై మీ కోపం చూపించకండి. ఇప్పటికే అనేక ఎకరాల కు సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. వాళ్లకు నీళ్లు ఇవ్వండి. మా ప్రాంతంలో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఎదో వృధా అని చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు బాల్క సుమన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను సూటిగా అడుగుతున్న మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ లతోపాటు 420 హామీలను వెంటనే అమలు చేయండి. పార్లమెంట్ ఎన్నికల ముందే అమలు చేయండి. ఎందుకంటే ఎన్నికల కోడ్ పేరు తో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేము అని చెప్పే ప్రయత్నం చేస్తారని అన్నారు.

అసలు కిషన్ రెడ్డితో ఎవరు అన్నారు మేము అన్నమా..ఎందుకు బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. పదే పదే  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇతర నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. అస్సలు బీజేపీ తో పొత్తు పెట్టుకుంటాం అని ఎవరు చెప్పారు. మాది సెక్యులర్ పార్టీ. మా కేసీఆర్ సెక్యులర్ నాయకుడు అని అన్నారు బాల్క సుమన్. బీజేపీతో పొత్తు పెట్టుకుంటమని ఎవరు అన్నారు.. వాళ్ళే మీడియాకు లీక్ లు ఇస్తున్నారు. వాళ్లే పేపర్లలో రాపిస్తున్నారు. వాళ్ళే వచ్చి మీడియా తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. మాది సెక్యులర్ పార్టీ.. మా నాయకుడు సెక్యులర్ నాయకుడు అని అన్నారు బాల్క సుమన్.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కుతోంది

Latest News

More Articles