Thursday, May 2, 2024

563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల…23 నుంచి ఆల్ లైన్లో దరఖాస్తులు..!!

spot_img

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. గతంలో రిలీజ్ చేసిన పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ తాజాగా ఈ ప్రకటన రిలీజ్ చేసింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. పేపర్ లీకేజీ కారణంతో ఒకసారి ప్రిలిమ్స్ ను రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలు పాటించకపోవడంతో రెండోసారి రద్దు అయ్యింది.

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో 503 పోస్టులతోపాటు కొత్తగా 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్ లైన్లో అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు, అప్లికేషన్ల ఎడిట్ చేసుకునేందుకు మార్చి 23 నుంచి 27 వరకు అవకాశం ఇచ్చింది. ప్రిలిమినరీ పరీక్ష మే, జూన్ మధ్యలో ఉండనుంది. మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉండనున్నట్లు బోర్డు తెలిపింది.

ఇది కూడా చదవండి: ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్ డబ్బు సంచులు మోస్తున్నడు

Latest News

More Articles