Sunday, May 19, 2024

రాజకీయ కక్షసాధింపు చర్యలు సరికావు..అభివృద్ధి చేయండి

spot_img

ఆందోల్ లో అభివృద్ధి పనులను ఆపాలని మంత్రి దామోదర రాజనర్సింహ చూస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన చంటి క్రాంతి…నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆందోల్ నియోజకవర్గంలో SDF, CDP  నిధులతో అభివృద్ధి పనులు చేశా.80 శాతం వరకు గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించా.కొన్ని టెండర్లు పూర్తి అయ్యాయి..మరికొన్ని పనులు నడుస్తున్నాయి. ఈ పనులను ఆపాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారట. మంజూరు అయిన నిధులు సరిపోకపోతే ఇంకా నిధులు ఇవ్వండి…కానీ పనులను మాత్రం ఆపవద్దు.రాజకీయ కక్షసాధింపు చర్యలు సరికావు..అభివృద్ధి చేయండి.కొత్త ప్రభుత్వం ఇప్పటికే నడుస్తున్న పనులను పూర్తి చేయాలి. అందోల్ అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇది కూడా చదవండి: హైద‌రాబాద్‌లోని ప‌లు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు

Latest News

More Articles