నాపై కేసు ఘటనలో మంత్రి దామోదర రాజనర్సింహ కుట్ర ఉంది..రాజకీయంగా కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. దళితబంధు ఘటనపై విచారణకు నేను సిద్ధం.. మరి మంత్రి దామోదర రాజనర్సింహ సిద్ధమా అని ప్రశ్నించారు. నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే.. నా భూమి మొత్తం భూమయ్యకి రాసి ఇస్తా…ఏ శిక్షకైనా నేను, నా తమ్ముడు సిద్ధమన్నారు. నిజం కాకపోతే దామోదర రాజనర్సింహ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని డిమాండ్ చేశారు. నాకు.. ఫిర్యాదు చేసిన భూమయ్యకి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి.. నిజానిజాలు బయటపడుతాయన్నారు చంటి క్రాంతి.
ఇది కూడా చదవండి: డ్రగ్స్ ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్ లు