హైదరాబాద్: ఆదివారం జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఆయన ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అవగాహనా లేకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిపినప్పుడు బీఆరెస్ నాయకులు ఏం మాట్లాడలేదు అనడం దారుణం అని మండిపడ్డారు.
తాము ఆనాడు లోక్ సభలో మాట్లాడిన వీడియోల్ని జీవన్ రెడ్డికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆనాడు రాజ్యసభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ నాయకులూ దానికి అడ్డుపడలేదని గుర్తుచేశారు. జీవన్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.