Friday, May 17, 2024

మంత్రి జూపల్లివి పచ్చి అబద్ధాలు, కట్టుకథలు

spot_img

హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు, కట్టుకథలు చెబుతున్నాడు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పైగా పరామర్శించిన కేటీఆర్ పై అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కనీసం హత్యను ఖండించకపోగా… ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సచివాలయంలో పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించారని విమర్శించారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడుతున్నారు కాబట్టే బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. ఉన్నత స్థాయి అధికారిచే సమగ్ర విచారణ జరపాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మంత్రి పక్కన కూర్చోబెట్టుకోవడం విచారణను ప్రభావితం చేయడం కాదా? హత్య వెనుక మీ అనుచరులు ఉన్నారు. కాబట్టే కనీసం పరామర్శించలేదు. కాల్ డేటా బయటపెట్టాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest News

More Articles