Friday, May 17, 2024

దొంగ మాటలు చెప్పి గెలిచిండు

spot_img

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కవ్వంపల్లి సత్యనారాయణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మానకొండూర్ నియోజకవర్గస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో పాటు మాజీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకి దొంగ మాటలు చెప్పి ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపించారు. అలాగే కవ్వంపల్లి సత్యనారాయణ తాను ఎమ్మెల్యేగా పదవిలో ఉండగా ఒక్కసారి కూడా మర్యాదగా మాట్లాడలేదని అన్నారు. ఎప్పుడు వాడు వీడు అని అసభ్య పదజాలంతో మాట్లాడేవాడని పేర్కొన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ బ్రోతల్ కొంపలు నడిపి ఎమ్మెల్యేగా గెలిచాడా అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా ఎమ్మెల్యే తన తీరు మార్చుకోకుంటే తాను కూడా అదే దారిలో వెళ్తానని పేర్కొన్నారు.

Latest News

More Articles