Saturday, May 18, 2024

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

spot_img

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఏమైనా కుట్ర కోణం ఉన్నదా..? అన్న కోణంలో పోలీసులు పూర్తి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ 42వ డివిజన్‌ పరిధిలోని ఇందిరానగర్‌, ఆదర్శనగర్‌ మధ్య నిన్న( మంగళవారం) మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగి గుడిసెలు కాలిపోయాయి. ఇవాళ( బుధవారం) బాధితులను వినోద్ కుమార్ పరామర్శించారు.

ప్రభుత్వం బాధితులకు తక్షణ అవసరాల కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు వినోద్ కుమార్. అధైర్య పడొద్దని, పేదలను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించి తగిన న్యాయం చేయాలని కోరారు. బాధితులకు వెంటనే తాత్కలికంగా నివాసాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.

 ఇది కూడా చదవండి: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు

Latest News

More Articles