వంతెనపై వరుసగా వెళ్తున్న ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం తమిళనాడులో ధర్మపురి జిల్లా లోని తొప్పూర్ ఘాట్ రోడ్ వద్ద వంతెనపై జరిగింది.
Also Read.. సిద్ధిపేట విద్యార్థులకు శుభవార్త.. ప్రతి 10 మంది పిల్లలకు ఒక కేర్ టీచర్..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంతెనపై బుధవారం సాయంత్రం మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొన్నాయి. సిసిటీవి కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రక్కులను బలంగా ఢీకొంది. ఒక ట్రక్కు అదుపు తప్పి వంతెనలో పడిపోగా.. ట్రక్కుల మధ్య వెళ్తున్న కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం నలుగురు మృతి చెందారు.
Also Read.. ఢిల్లీలో మెరిసిన ఓరుగల్లు.. రాష్ట్రపతి చేతుల మీదుగా లక్ష్మీ ప్రియకి అవార్డు
మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.