Sunday, May 19, 2024

రాజస్థాన్‌లో ఘోరం.. రైల్వే ట్రాక్‌పై పడ్డ బస్సు.. నలుగురి మృతి

spot_img

జైపుర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన దౌస జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో జరిగింది.

Also Read.. ఏపీలో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు మృతి

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 28 మందికి గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ రాజ్‌కుమార్ కస్వా పేర్కొన్నారు.

Latest News

More Articles