Sunday, May 5, 2024

ఏపీలో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు మృతి

spot_img

ఏపీ: విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో విషాదకర ఘటన జరిగింది.  12వ ప్లాట్‌ఫామ్‌ దగ్గర ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. చనిపోయిన వారిలో కండక్టర్‌తోపాటు ఓ మహిళ, బాలుడు ఉన్నారు. పలువురు గాయపడ్డారు.

Also Read.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని ఆటోనగర్‌ డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి గుంటూరు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు ఒక్కసారిగా 12వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ పైకి దూసుకొచ్చింది. దీంతో కండక్టర్‌తోపాటు అక్కడ ఉన్న మరో ఇద్దరు మరణించారు.

Also Read.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టింది

మృతులను బస్సు కండక్టర్‌ వీరయ్య, ప్రయాణికురాలు కుమారి, ఆమె మనవడు అయాన్‌గా గుర్తించారు. బస్సు డ్రైవర్‌ రివర్స్‌ గేరుకు బదులు ఫస్ట్‌ గేర్‌ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణ జరుగుతుందన్నారు.

Latest News

More Articles