Sunday, May 19, 2024

హైకోర్టు అనర్హత వేటుపై.. సుప్రీం కోర్టుకు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

spot_img

ఎమ్మెల్యేగా అనర్హత వేటుకి గురైన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. ‘ హై కోర్టు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీర్పు ఇచ్చింది. ఎక్స్ పార్టీ తీర్పు ఇచ్చారు. నాకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై నేను సుప్రీం కోర్టుకు వెళ్తున్నా. నా మీద నాలుగు అభియోగాలతో ప్రత్యర్థులు కోర్టు ను ఆశ్రయించారు. నాకు తీర్పుపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు.

నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 వేల మెజారిటీ తో గెలిచాను. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలుస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. కొందరికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో తీర్పు నాకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.

Latest News

More Articles