హైదరాబాద్: మంత్రిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డికి.. గనులు, భూగర్భ వనరులశాఖను సీఎం కేసీఆర్ కేటాయించారు. రాజ్భవన్లో గురువారం మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై.. మహేందర్రెడ్డితో ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు.