ఖమ్మంలో కన్నుల పండువగా గణేష్ నిమజ్జల శోభాయాత్ర జరిగింది. స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గాంధీచౌక్ లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి గణేష్ శోభాయాత్ర ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దీనికి ఎంపీ నామా నాగేశ్వరరావు, మేయర్ పోనుకొల్లు నీరజ , కలెక్టర్ వి పి గౌతమ్, సి పి విష్ణు వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలు హాజరయ్యారు.
గణనాధులకు పూజలు నిర్వహించి, పూలు చల్లి, శోభాయాత్రకు స్వాగతం పలికారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం మున్నేరు దగ్గర ఏడు క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమం పర్యవేక్షిస్తున్న ఖమ్మం సీపీ విష్ణు వారియర్. జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఇక నేడు , రేపు రెండు రోజులపాటు కొనసాగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగనుంది.