Friday, May 17, 2024

జీడిమెట్లలో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత

spot_img

హైదరాబాద్: జీడిమెట్లలో భారీగా గంజాయి పట్టుబడింది. నర్సరీ మొక్కల మాటున గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.కోటి విలువైన 400కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు షాపూర్ నగర్ లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాసరావు వివరించారు.

రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా.. ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారు మధ్యప్రదేశ్ కు చెందిన బబ్లూ, గోవింద్ లు ఉన్నారు. పట్టుబడిన 400కేజీల గంజాయి విలువ రూ.కోటి ఉంటుందని తెలిపారు. వారివద్ద నుంచి ఒక డీసీఎం వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీన పరచుకున్నామని, భారీ గంజాయి రవాణాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవరించిన బాలనగర్ ఎస్ఓటి సిఐ రాహుల్ దేవ్, మరియు పోలీసులను డీసీపీ అభినందించారు.

Latest News

More Articles