Thursday, May 2, 2024

సింగపూర్‌లో 75శాతం పెరిగిన కరోనా కేసులు..!

spot_img

సింగపూర్‌లో కొవిడ్‌ కేసులు 56వేల మార్క్‌ను దాటాయి. వారంలోనే 75శాతం కేసులు పెరిగాయి. డిసెంబర్‌ 19 నుంచి రోజువారీ కొవిడ్‌ అప్‌డేట్స్‌ను విడుదల చేయాలని సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రజలకు సూచించింది. వృద్ధులున్న ఇండ్లలోనూ మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేసింది. సింగపూర్ ఎక్స్‌పో హాల్ నెం.10లో కోవిడ్ రోగుల కోసం పడకలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మరోవైపు భాతర్‌లో కూడా కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం దేశంలో 312 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలోనే 280 కేసులు నమోదు అయ్యాయి. అయితే, వ్యాధి సోకిన రోగుల్లో లక్షణాలు తీవ్రంగా లేవని అధికార వర్గాలు చెప్పాయి.

Latest News

More Articles