Friday, May 17, 2024

శ్రీవారి భక్తులకు శుభవార్త. 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

spot_img

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైంకుఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది.

వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్రత్యక్షంగా ద‌ర్శనం చేసుకున్న భాగ్యం క‌లుగుతుందన్న విశ్వాసం భక్తులలో ఉంటుంది. స్వయంగా వ‌చ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. సిఫార‌సు లేఖ‌లు స్వీకరించబవని స్పష్టం చేసింది. ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు దర్శనం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.

Latest News

More Articles