Saturday, May 18, 2024

పాత నోటిఫికేషన్ల ద్వారానే పరీక్షలు నిర్వహించాలి

spot_img

పాత నోటిఫికేషన్ల ద్వారానే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్వీ రాష్ట్ర అ
ధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. రేవంత్ రెడ్డి సీఎం కాకా ముందు అనేక సభల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంది ఎదురుచూశారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడుతాడు…నోటిఫికేషన్లు వేస్తాడు అని నిరుద్యోగులు ఆశ పడ్డారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత నమ్మించి మోసం చేశాడన్నారు.

మంత్రి వర్గ సమావేశాలు పెట్టుకున్నారు కానీ ఒక్క సమావేశంలో కూడా జాబ్ క్యాలెండర్ పై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. నోటిఫికేషన్ లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు. సుప్రీంకోర్టు లో కేస్ ఉంది.దాన్ని పట్టించుకోకుండా పాత నోటిఫికేషన్ రద్దు చేశారు.. మళ్ళీ కొత్తగా వాటికి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వెనుక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉందన్నారు. గ్రూప్- 2 ఎగ్జామ్ వెంటనే పెట్టండి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయకుండా అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలన్నారు. కొత్త నోటిఫికేషన్ల ద్వారా మళ్ళీ కోచింగ్ కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీంతో నిరుద్యోగులకు ఆర్ధిక భారం అవుతుందన్నారు. బిస్వాల్ కమిటీ అన్నావ్ గా… ఆ కమిటీ నివేదిక బయట పెట్టడం లేదు. గతంలో కోదండరాం రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ లు రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు.

ఇది కూడా చదవండి:విద్యార్థినుల ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి

Latest News

More Articles