సికింద్రాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ఊడుస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన కళ.. జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తోంది. రోజూవారి మాదిరిగానే శనివారం కూడా కళ తన విధులకు వెళ్లింది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో రోడ్డు ఊడుస్తుండగా.. ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో తలకు తీవ్ర గాయం కావడంతో ఘటనాస్థలంలోనే కన్నుమూసింది. అతివేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు. కారును నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తిని సికింద్రాబాద్కు చెందిన యువకుడిగా గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Road Also: వివేక్ ప్రజలకు చేసిందేం లేదు.. అందుకే చెప్పుకునే దమ్ము లేదు..