Friday, May 17, 2024

చాక్లెట్లలో బంగారం.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

spot_img

చాక్లెట్లలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను పరిశీలించగా బంగారు చాక్లెట్లు బయటపడ్డాయి. బంగారం తరలిస్తున్న ఇద్దరు నిందితులను కస్టమ్స్ అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని చాక్లెట్ కవర్లలో చాక్లెట్ల మాదిరిగా ప్యాకింగ్ చేసుకొని తరలించేందుకు ప్రయత్నిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. 13 చాక్లెట్లలో 13 బంగారం ముక్కలను అమర్చి తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుల వద్ద 269 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 16. 5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. విచారణ చేపట్టారు.

Latest News

More Articles