Friday, May 17, 2024

ఎస్బీఐలో కోటిన్న‌ర విలువైన బంగారం చోరీ

spot_img

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 30లక్షల నగదు, రూ.కోటిన్నర విలువ చేసే బంగారం నిన్న(గురువారం) రాత్రి దొంగతనం జరిగింది. బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ డ్రిల్స్ ను గ్యాస్ కట్టర్ తో తొలగించి దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు గుర్తించారు. ఇవాళ(శుక్రవారం) ఉద‌యం ఓపెన్ చేయడానికి వచ్చిన సిబ్బంది…చోరీ జరిగినట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలుసులు ఘటనా స్థానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ మెసేజ్ లింక్ పై క్లిక్‌ చేసారో ఇక అంతే

Latest News

More Articles