పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడింగించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్ధులు ఈ నెల(జనవరి)8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వాహకులు ఏ.కృష్ణారావు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని, విద్యార్థులు ఆయా స్కూళ్లలో ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి జరగనున్నాయి.
ఇది కూడా చదవండి:విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు