Sunday, April 28, 2024

కళ్యాణ లక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారు?

spot_img

రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 102 కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేసారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రక్రియ తొందరగా ప్రారంభించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.

Also Read.. అన్నను బస్సు ఎక్కించి.. అదే బస్సు కింద జారిపడిన చెల్లి

Latest News

More Articles