భారత్తో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా.. 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ డ్రా చేయాలంటే భారత్.. 79 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు సఫారీ ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ 106 (103 బంతుల్లో, 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఓవర్ నైట్ స్కోరు 62-3తో రెండో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికాకు బుమ్రా వరుస షాకులిచ్చాడు. బుమ్రా (6/61) మరోసారి విజృంభించాడు.