హైదరాబాద్: జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో గ్రే హాండ్స్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆదివారం రాత్రి బలమైన ఈదరుగాలులతో భారీ వర్షం పడే సమయంలో బైకుపై అటుగా వెళుతున్న కానిస్టేబుల్ వీరాస్వామి.. అదుపు తప్పి ఫుట్ పాత్ మీద పడ్డాడు. అక్కడే ఉన్న కరెంట్ స్తంభం వద్ద షాక్ తగిలి కానిస్టేబుల్ వీరా స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.