వాంఖేడ్ స్టేడియంలో ఉత్కంఠపోరులో ముంబై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ 1000వ మ్యాచ్లో రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ముంబై మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 62 బంతుల్లో 124( 16 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో ఊచకోత కోశాడు. మిగతావాళ్లు పెద్దగా రాణించలేదు. ముంబై బౌలర్లు ఇచ్చిన 25 ఎక్స్ట్రాలే రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ 3, పియూష్ చావ్లా రెండు వికెట్లు తీశారు.
అనంతరం 213 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 55( 8 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ 14 బంతుల్లో 45 నాటౌట్( 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ 26 బంతుల్లో( 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ముంబై బౌలర్లను సమర్థంగా అడ్డుకొని విజయం అందించారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీశారు. వాంఖడే స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్యఛేదన కావడం విశేషం.