Friday, May 17, 2024

కర్ణాటక బీజేపీకి షాక్.. కాంగ్రెస్ కే రాజ్ కుమార్ కుటుంబం మద్దత్తు..!

spot_img

కన్నడ సూపర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వనున్నారు. ఎందుకంటే ఆయన సతీమణి గీతా శివరాజ్ కుమార్ శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో బెంగుళూరులో ఆమె పార్టీలో చేరుతారు. గీత శివరాజ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో జనతాదళ్ తరుపున పోటీ చేశారు కూడా. దీంతో ఆమెకు రాజకీయాలు కొత్త కాదు. అందుకే పునీత్ శివరాజ్ కుమార్ ను కాదని నేరుగా ఆమెనే రంగంలోకి దిగుతున్నారు.

స్టార్ నటుడు కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తుండడంతో పునీత్ కుటుంబం కూడా బీజేపీ వైపే మళ్లుతుందని అందరూ అనుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణించిన సమయంలో ఆయనను బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించింది. అయితే తాజాగా పునీత్ శివరాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇక గీతా శివరాజ్ కుమార్ సోదరుడు కుమార్ బంగారప్ప బీజేపీ తరుపున ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ ఆమెకు కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తే సోదరీ సోదరుల మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంది.

Latest News

More Articles