Friday, May 3, 2024

రేవంత్ రెడ్డి.. పంద్రాగ‌స్టు లోపు రుణ‌మాఫీ చేయ‌క‌పోతే రాజీనామా చేస్తావా

spot_img

రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. పంద్రాగ‌స్టు లోపు రూ. 39 వేల కోట్ల రుణ‌మాఫీ చేయ‌క‌పోతే రాజీనామా చేస్తావా..? అని సీఎం రేవంత్ రెడ్డికి హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఇంకా రైతుబంధు ఇవ్వ‌నే ఇవ్వ‌లేదు.. కానీ ఆగ‌స్టు 15వ తేదీలోపు రుణ‌మాఫీ చేస్తా అంటున్నాడ‌ని రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటీలే మీకు భస్మాసురహస్తం అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారు. మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2500 సహాయం, కళ్యాణాలక్ష్మి కింద‌ తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను ఓడించాల‌ని హ‌రీశ్‌రావు సూచించారు.

రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. నాలుగున్నర నెలల్లోనే ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అంటే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి. 2014, 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదు.. మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు మోత్కుపల్లి న‌ర్సింహులు, హనుమంతరావులే మా సీఎం కలవట్లేదు అని అంటున్నారు. మెడలో పేగులేసుకుంటా, మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రోతగా ఉన్నాయి

Latest News

More Articles