సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఇవాళ(ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా ఆర్టీసీ విలీనానికి సంబంధించి అపాయింట్మెంట్ డే ప్రకటించలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డే అమలు చేయాలన్నారు. ప్రభుత్వంతో విలీనం చేస్తూ తక్షణం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు సర్వీసులతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై భారం పడుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇవ్వాలన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు. 2013 పీఆర్సీ బాండ్స్ కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని.. బాండ్స్ కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలంటూ లేఖలో తెలిపారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: మీజిల్స్ సోకి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులు