Tuesday, May 21, 2024

సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి

spot_img

సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు సీఏం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అస్సాంలో ఒకరిని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కి మద్దతుగా ఇవాళ(సోమవారం) నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన ఆయన..అరెస్టు చేయకుంటే మోడీ, రేవంత్ ఇద్దరు కలిసినట్టే..ఇద్దరి దోస్తనా బయట పడ్డట్టే. గులాబి జెండా ఉండగా ఈ ప్రాంతం అభివ్రుది చెందింది. కాంగ్రెస్ వచ్చాక అనేక సమస్యలు వచ్చాయి. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మహిళలకు 2500 అని మాట తప్పారు. 30 దాటినా పింఛన్లు ఇవ్వడం లేదు. తులం బంగారం ఇస్తా అని మోసం చేశారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చాక బంగారం ధర కూడా పెరిగింది. నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. కాంగ్రెస్ కు మళ్ళీ ఓటు వేస్తే హామీలు అమలు చేయరు. కొట్లాడాలంటే మీరు బీఆర్ఎస్ గెలిపించాలని కోరుతున్నా అని అన్నారు.

కాంగ్రెస్ పాలన బయట పడ్డది.బీజేపీకి ఓటు వేస్తే పేనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే అని తెలిపారు హరీశ్ రావు. తెలంగాణకు బీజేపీ ఎంతో నష్టం చేసిందన్నారు. అందువల్ల బీజేపీ నమ్మద్దు అని మనవి చేస్తున్నా అని అన్నారు. అలవి గాని హామీలు ఇస్తే మొన్న దుబ్బకాలో ఆయన్ని చిత్తుగా 54 వేల ఓట్లతో ఓడించారు. ట్రస్ట్ ద్వారా వంద కోట్లు ఖర్చు చేస్తా అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామా రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా అని అన్నారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: 14 సీట్లు గెలిచేందుకు క‌ష్ట‌ప‌డుదాం

Latest News

More Articles