హైదరాబాద్ : మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగు రోజులపాటు దాదాపు 60 కేంద్రాలలో హెచ్ఎండిఏ యంత్రాంగం 1.5 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి ప్రజలకు మరింతగా దగ్గర అయ్యింది.
Also Read.. కొడంగల్ క్యాడర్ జంప్.. తుక్కుగూడ మీటింగ్ అవుతుండగానే రేవంత్ కి షాక్..!
హెచ్ఎండిఏ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీరామారావు ఈ నెల 17వ తేదీన అధికారికంగా ప్రారంభించారు. ఆ తర్వాత హెచ్ఎండిఏ యంత్రాంగం జంట నగరాలు, శివారు ప్రాంతాలలో గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది.