Sunday, April 28, 2024

కొడంగల్ క్యాడర్ జంప్.. తుక్కుగూడ మీటింగ్ అవుతుండగానే రేవంత్ కి షాక్..!

spot_img

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరికల పర్వం నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం లేకనే ఈ చేరికలు కొనసాగుతున్నట్టు పార్టీలో చేరిన కార్యకర్తలు చెప్తున్నారు.

తాజాగా దుధ్యాల్ (నూతన మండల) పరిధిలోని “పోలేపల్లి” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పట్నం నరేందర్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. పోలేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో 100మందికి పైగా కార్యకర్తలు సర్పంచ్ రామకృష్ణ రెడ్డి మరియు తూర్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలో కలవడం జరిగింది. వారికి గులాబీ కండువా లు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక,మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు..

మోడీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

Latest News

More Articles