వాయువ్య చైనాలోని గన్సు, కింగ్హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాష్ట్ర వార్తా సంస్థ నివేదిక ప్రకారం, 95 మంది మరణించారు. సోమవారం (డిసెంబర్ 18) సాయంత్రం సంభవించిన భూకంపం కారణంగా గన్సు ప్రావిన్స్లో 86 మంది, పొరుగున ఉన్న కింగ్హై ప్రావిన్స్లో తొమ్మిది మంది మరణించినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
నివేదికల ప్రకారం, బలమైన భూకంపం కారణంగా గన్సు, కింగ్హై ప్రావిన్సులలో 200 మందికి పైగా గాయపడ్డారు. పొరుగు ప్రావిన్స్ కింగ్హైలోని హైడాంగ్ నగరంలో తొమ్మిది మంది మరణించారు. 124 మంది గాయపడ్డారు. భూకంపానికి సంబంధించి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు చైనా అధికారిక వార్తా మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదించింది. రాష్ట్రపతి ఆదేశానుసారం, బాధిత ప్రజలకు సరైన పునరావాసం కల్పించడం, ప్రజలను సురక్షితంగా రక్షించడం, పెద్ద ఎత్తున సెర్చింగ్, రెస్క్యూ కార్యకలాపాలు చేపట్టారు.
బలమైన భూకంపం కారణంగా చాలా ఇళ్లు కూలిపోయాయని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. దీంతోపాటు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భూ ప్రకంపనలు వచ్చిన వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి పరుగులు తీశారు. సోమవారం చైనాలోని గన్సు, కింగ్హై ప్రావిన్స్లలో సంభవించిన బలమైన భూకంపం తరువాత, మంగళవారం (డిసెంబర్ 19) తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి.
6.0 Earthquake Hits China#earthquake #quake #sismo
Long Version:https://t.co/1VtvbbaGTo pic.twitter.com/0d8NIetLW3— Meteor News (@FishNewsChannel) December 18, 2023
భూకంప తీవ్రతను యుఎస్ జియోలాజికల్ సర్వే 5.9గా, జిన్హువా 6.2గా అంచనా వేసింది. క్వింఘై ప్రావిన్స్తో సరిహద్దుకు సమీపంలో ఉన్న గన్సు ప్రావిన్స్లో భూకంపం కారణంగా కొన్ని స్థానిక గ్రామాలలో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని నివేదికలు తెలిపాయి. ఇది కాకుండా, పడిపోయిన పైకప్పులు, ఇతర శిధిలాలు సోషల్ మీడియాలోపోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: చలికాలంలో మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ 5 చిట్కాలను పాటించండి..!!