తాజాగా ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది. దాంతో వినియోగదారులు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. తాజాగా తెలుగు సినీ నటుడు వెన్నెల కిషోర్ ఇంట్లో రెండు వేల నోట్లు కుప్పలుతెప్పలుగా పడి ఉన్నాయని హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘ఓసారి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు రెండు వేల నోట్లు చాలా కనిపించాయి. దాంతో వాటిని ఫోటో తీశాను. ఇప్పుడు ప్రభుత్వం రెండు వేల నోట్లను రద్దుచేసింది. మరి వాటిని ఆయన ఏం చేస్తారో చూడాలి’ అని విష్ణు ట్వీట్ చేశాడు. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విష్ణు ట్వీట్కు వెన్నెల కిషోర్ రిప్లై కూడా ఇచ్చాడు. నా మీద పడ్డారేంటి అని ప్రశ్నించాడు.
Photo was taken when I visited Sri. @vennelakishore garu home. I wonder what he will do with these 2000₹ notes. 🤔 pic.twitter.com/bLApojXxyA
— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2023