చాలామంది భార్యభర్తలు కుటుంబ గొడవలో, లేక దంపతుల మధ్య మనస్పర్థలతోనో విడాకులు తీసుకుంటుంటారు. అయితే ఇక్కడ ఓ జంట మాత్రం విచిత్ర కారణంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. కేరళకు చెందిన ఓ జంట 2012లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వృత్తిరిత్యా అబుదాబిలో నివసిస్తున్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి కాపురంలో వంట చిచ్చుపెట్టింది. భార్యకు సరిగా వండటం రాకపోవడంతో విసిగిపోయిన భర్త.. తనకు భార్య నుంచి విడాకులు కావాలని కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. భార్య తనను ఎన్నడూ గౌరవించలేదని, ఆమె నుంచి తనను దూరం పెట్టిందని, తన తల్లితో కూడా గొడవ పడుతుందని తన పిటిషన్లో పేర్కొన్నాడు.
ఇక భార్య కూడా తన వాదనలు కోర్టుకు వినిపించింది. తన భర్త లైంగిక రుగ్మతతో బాధపడుతున్నాడని తెలిపింది. అతనికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కానీ అతను మందులు తీసుకోవడం మానేసి, శాడిస్ట్లాగా ప్రవర్తిస్తున్నాడని కోర్టుకు తెలిపింది.
ఇరువురి వాదనలు బుధవారం విన్న హైకోర్టు.. భర్త విడాకుల పిటిషన్ను కొట్టివేసింది. అలాగే భార్యకు వంట రాకపోవడం దారుణం కాదని, అది ఆధారంగా చేసుకొని విడాకులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. ‘వంట చేయడం రాకపోతే అది క్రూరత్వం ఎలా అవుతుందని’ ధర్మాసనం ప్రశ్నించింది.
Read Also: ఎన్టీఆర్కు అరుదైన గౌరవం.. ఆ అవకాశం దక్కిన తొలి తెలుగు హీరోగా ఖ్యాతి