Friday, May 17, 2024

ఆగస్టు 27న హైదరాబాద్ మారథాన్

spot_img

హైదరాబాద్: ఎన్‌ఎండిసి హైదరాబాద్ మారథాన్ 12వ ఎడిషన్‌ ఆగస్టు 27 (ఆదివారం) జరగనున్నది. ఇందులో  20,000 మందికి పైగా రన్నర్లు పాల్గొంటారని నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఆగస్టు 26న 5కే ఫన్‌ రన్‌, 10కే, హాఫ్‌ మారథాన్‌ (21.09 కి.మీ.), ఆగస్టు 27న ఫుల్‌ మారథాన్‌ (42.19 కి.మీ.) నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ సమక్షంలో మారథాన్ అధికారిక రేస్ టీ-షర్ట్‌ను అధికారులు ఆవిష్కరించారు. మారథాన్ మార్గంలో పానీయాలు,  ఎలక్ట్రోలైట్ల కోసం మొత్తం 28 స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలో అంబులెన్స్‌,  3,500 మందికి పైగా వాలంటీర్లు సేవలు అందిస్తారని రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా చెప్పారు.

Latest News

More Articles