Friday, May 3, 2024

పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట..!

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి పరువునష్టం కేసులో ఊరట లభించింది. ఆగస్టు 2 వరకు ప్రత్యక్ష హాజరు నుంచి ముంబయి హైకోర్టు మినహాయింపునిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీకి చెందిన మహేశ్‌ శ్రీశ్రీమల్‌ 2021లో పరువునష్టం పిటిషన్‌ దాఖలు చేశారు.  ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎస్‌వీ కొత్వాల్‌ నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

మరోవైపు ఇదే అంశంపై గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ వేసిన దావాలో సూరత్‌ కోర్టు  రాహుల్‌గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.  శిక్షను నిలిపేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోన్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ గుజరాత్‌ హైకోర్టులో రాహుల్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

Latest News

More Articles