న్యూఢిల్లీ : 156 తేలికపాటి ప్రచండ్ యుద్ధ విమానాల కొనుగులోకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు భారత వైమానిక దళం (IAF) ఆర్డర్ ఇవ్వనుంది. వీటిని చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించనున్నారు. ఇప్పటికే 15 ప్రచండ్ విమానాలతో వైమానిక దళం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
Also Read.. పాక్లో వరుస బాంబు పేలుళ్లు.. 50 మందికి పైగా మృతి
దేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి 156 ప్రచండ్ విమానాలను సేకరించాలని యోచిస్తున్నట్టు భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి సైతం ఇటీవల పేర్కొన్నారు. తమ ప్రతిపాదనకు కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్ లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. 156 విమానాల కొనుగోలుకు రూ. 1.5 లక్షల కోట్లు అవుతుందని వెల్లడించారు.