Friday, May 17, 2024

రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మసిటీ రద్దు

spot_img

రంగారెడ్డి: రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మసిటీని రద్దు చేశారని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మసిటీ రద్దు చేస్తే వెంటనే రైతులకు భూములను తిరిగిచ్చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

ఫార్మసిటీ తెచ్చింది ఆ నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని నిలదీశారు. గతంలో ఇచ్చిన అభివృద్ధి పనులను యధావిధిగా కొనసాగించాలని సూచించారు. అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు.

Latest News

More Articles