మహారాష్ట్రలో 10 నెలల కాలంలో 2,366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. అత్యధికంగా అమరావతి రెవెన్యూ డివిజన్లో 951 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. ఛత్రపతి సాంబాజీనగర్ డివిజన్లో 877 మంది మరణించారు.
నాగపూర్ డివిజన్లో 257, నాశిక్ డివిజన్లో 254 మంది, పుణె డివిజన్లో 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు మంత్రి అనిల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.