రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. భూ తగాదాల నేపథ్యంలో తమ్ముడిని నరికి చంపాడు ఓ అన్న. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లెలో త్యాగ రాకేష్ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు త్యాగ తిరుపతి గొడ్డలితో నరికి చంపాడు. రాకేష్ హత్యకు భూ తగాదాలే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.