ఇరాక్, సిరియా దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో అమెరికాకు గొడవలు అక్కర్లేదని, అమెరికాకు ఎవరికైనా నష్టం వాటిల్లితే తీవ్రపరిణామాలు తప్పవని బిడెన్ హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. మిడిల్ ఈస్ట్లో పెరిగిన ఉద్రిక్తతకు ప్రతిస్పందనగా అమెరికా నుండి ఇది పెద్ద ప్రకటన. అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ “యునైటెడ్ స్టేట్స్ మధ్యప్రాచ్యంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా సంఘర్షణను కోరుకోదు. కానీ మాకు హాని చేయాలనుకునే వారికి ఇది తెలుసు: మీరు ఒక అమెరికన్కు హాని చేస్తే, మేము గట్టిగా ప్రతిస్పందిస్తాము” అంటూ పేర్కొన్నారు.
ఆదివారం జోర్డాన్లోని యుఎస్ మిలిటరీ పోస్ట్పై ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్లు డ్రోన్ దాడి చేసిన తర్వాత వైమానిక దాడులు జరిగాయి. దీని ఫలితంగా ముగ్గురు యుఎస్ సర్వీస్ సభ్యులు మరణించడంతోపాటు 40 మందికి పైగా గాయపడ్డారు. సిఎన్ఎన్ నివేదిక ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ ది ఇరాక్,సిరియా రెండింటిలోనూ మిలీషియా స్థానాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు చేసింది.
ఇరాన్-మద్దతుగల మిలీషియాపై దాడుల మధ్య అమెరికా ఈ విధంగా ప్రతిస్పందించింది. ఈ దాడులలో అమెరికన్ సైనికులు చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా అధికారులు ధృవీకరించారు. గత ఆదివారం, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మద్దతుతో తీవ్రవాద గ్రూపులు ప్రయోగించిన డ్రోన్ ద్వారా ముగ్గురు US సైనికులు జోర్డాన్లో మరణించారని బిడెన్ చెప్పారు.
ఇది కూడా చదవండి: ఓయూలో దారుణం.. ఇదేనా ప్రజాపాలన.. బువ్వ లేదన్న పాపానికి అరెస్ట్