Friday, May 17, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ మారింది!!

spot_img

శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. టీటీడీ అధికారిక వెబ్ సైట్ పేరును మారోసారి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.inగా మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్ లో భాగంగా వెబ్ సైట్ ను మార్చినట్లు అధికారులు తెలిపారు. వెబ్ సైట్ ద్వారా టీటీడీ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు వెబ్ సైట్ ద్వారానే విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి భక్తులు కొత్త వెబ్ సైట్లోనే టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

ఇది కూడా చదవండి : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం యువకుడు దుర్మరణం..!!

Latest News

More Articles