Monday, May 6, 2024

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడు దుర్మరణం!!

spot_img

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మరణించాడు. పెనుబల్లిమండలం వీఎంబంజర్కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి కుమారుడు సాయిరాజీవ్ రెడ్డి అమెరికాలోని టెక్సాస్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సాయిరాజీవ్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఓ పార్సిల్ తీసుకునేందుకు తన కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది.

తీవ్రగాయాలైన సాయిరాజీవ్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే మరణించినట్లు తెలిసింది. ఆదివారం అర్థరాత్రి 12గంటలకు ఈ ఘటన గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది. తండ్రి భూపాల్ రెడ్డి సోమవారం అమెరికాకు వెళ్లారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్ రెడ్డి వివాహం జరిగింది. కాగా సాయిరాజీవ్ రెడ్డి సోదరి శిల్పారెడ్డి కూడా టెక్సాస్ లోనే నివాసం ఉంటున్నారు.

Latest News

More Articles